న్యాయం చేయమని అడిగే రైతులు, గిరిజనులపై లాఠీలు ఝుళిపించి జైల్లో వేస్తారా?

Published: Tuesday July 12, 2022
మహిళలు, బాలింతలని కూడా చూడకుండా కాళ్లు చేతులు విరిచి అక్రమ కేసులు పెడతారా
 
ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్...
 
ఎన్నికలెప్పుడొచ్చినా నిన్ను గద్దె దించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు
 
ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్
 
కరీంనగర్ జూలై  11 ప్రజాపాలన ప్రతినిధి :
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ధరణలో చోటుచేసుకున్న లోపాలను సరిచేయలేక పోయారంటూ   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్థానిక ఎంపి బండి సంజయ కుమార్ నగరంలోని వరలక్ష్మి గార్డెన్ మౌనదీక్షకు దీగారు. అనంతరం ఆయన ఈ సందర్బంగా బండి మాట్లాడుతూ ప్రజలకు సిఎం కేసీఆర్ ఇచ్చిన
 హామీలను
ఎందుకు అమలు చేయడం లేదని విమర్శించారు? అడవి బిడ్డల దగ్గరకే వచ్చి కుర్చీ వేసుకుని కూర్చొని పొడు భూముల సమస్యను పరిష్కరిస్తానని, పట్టాలిప్పిస్తానన్న  హామీ ఏమైందని బండి ప్రశ్నించారు, ధరణిలో చోటు చేసుకున్న లోపాలను సవరిస్తానన్న హామీ ఏమైందంటూ సిఎం కేసీఆర్ పై తీవ్రంగా విరుచుకు పడ్డారు.  ఆదివాసీ, గిరిజన బిడ్డల,ధరణి వల్ల ఇబ్బంది పడుతున్న వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. 
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది
ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు రాష్ట్రం ఏలాంటి అభివృద్దికి నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో రైతులు భూ సమస్యతో బాదపడుతున్నారని, వాటిని పరిష్కరించ కుండా పైగా ధరణి పోర్టల్ ప్రవేశ పెట్టి సిఎం కేసీఆర్ రైతుల జీవితాలతో ఆడు కుంటున్నారని బండి మండి పడ్జారు.
ధరణి పోర్టల్ తెచ్చి ప్రశాంతంగా ఉన్న ఉళ్లల్లో చిచ్చు పెట్టాడని,. సీఎం ఏ పని చేసినా ఆయనకు, ఆయన కుటుంబానికి మేలు చేయాలనే ఆలోచన తప్ప. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశమే లేదన్నారు.పేదల భూముల ను
గోల్ మాల్ చేయడానికి, భూములను కబ్జా చేసుకుని దండుకోవడానికే ధరణి పోర్టల్ తీసుకొచ్చిండన్నారు.. 
నలఫై,, ఏబది ఏళ్ల కింద భూములు అమ్ముకున్నవాళ్లు, వదిలేసి వెళ్లిపోయిన వాళ్లంతా ఇయాళ ఊర్లల్లోకి వచ్చి రైతుల మీద పడి భూములు లాక్కుంటున్నరని,దీంతో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న రైతుల గుండె పగిలిపోతున్నాయని ఆవేగన వ్యక్తం చేశారు.ధరణి పోర్టల్ అంతా తప్పుల తడక గా తయారైందని, తహిసిల్దార్ వద్దకు పోతే నా చేతుల్లో లేదని,  కలెక్టర్ వద్దకే  వెళ్లాలంటూ చెప్పుతుండటంతో  రైతులు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు.ఏండ్ల తరబడి మేం సాగు చేసుకుంటూ తమ పేర పట్టా పాస్ బుక్కులివ్వకుండా వేధిస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారని, ఇదేందని రైతులు అడిగిన రైతులను హైదరాబాద్ పోవాలని, సీఎంను కలవాలని అధికారులు బుకాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. 
సమస్యను పరిష్కరించాలనే భావన అధికారుల్లో ఉన్నప్పటికీ వారి చేతుల్లో ఆ అధికారం లేకుండా పోయిందన్నారు. కనీసం రైతుల సమస్యలు వినాలనే ఆలోచన కూడా లేకుండా పోయిందన్నారు.
రెవిన్యూ కార్యాలయాల్లో కుప్పలు తెప్పలుగా రైతుల భూ సమస్యల దరఖాస్తులు నిండిపోయినాయని,వీటిని సరిదిద్దాలనే ఆలోచన కూడా సీఎంకు లేకపోవడం మూర్ఖత్వమని బండి మండి పడ్డారు. టీఆర్ఎస్ నేతలే స్వయంగా ధరణి బాధలు చెబుతున్నా... ప్రజలు నిలదీస్తున్నారని చెబుతున్నా సీఎం కేసీఆర్ కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు.
ధరణి పోర్టల్ ను రద్దు చేస్తే సీఎం లక్ష్యం నెరవేరదని, ఇప్పటికే వేల కోట్ల రూపాయల విలువైన భూములను సీఎం, ఆయన కుటుంబ సభ్యుల పేరిట మార్పిడి చేసుకున్నడు. రద్దు చేస్తే నష్టపోతాడనే ఉద్దేశంతోనే లోపాలను సరిదిద్దడం లేదని ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో వేలాది మంది రైతులు ధరణి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను మా ద్రుష్టికి తెచ్చారని. వాటిని పరిష్కరించాలని సీఎంకు లేఖ రాసినా పట్టించుకోవడం లేదన్నారు.
ఇఫ్పటికే 15 లక్షల ఎకరాలకు సంబంధించిన వివరాలు ధరణి పోర్టల్ లో నమోదు కాలేదని, నమోదైన వాటిలోనూ 50 శాతం మేరకు తప్పుల తడకలతో కొట్టుమిట్టాడుతున్నాయన్నార సీఎం ఇప్పటికైనా స్పందించాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వినాలి. అధికారులను ప్రజలు నిలదీస్తున్న విషయాన్ని గుర్తించి వెంటనే పరిష్కరించాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని బండి కోరారు.
ఎప్పుడు ఎన్నికలొచ్చినా నిన్ను సీఎం సీటు నుండి దింపేయడం ఖాయమని బండి సవాల్‌ విసిరారు. 
నిన్నటి దాకా జర్నలిస్టులు ప్రశ్నిస్తే దబాయించే సీఎం ఇవాళ జర్నలిస్టులను బతిమిలాడుకునే స్థితికి వచ్చిందంటే.. అది బీజేపీ చేసిన పోరాట ఫలితమేనని బండి అన్నారు.
పోడు భూముల్లో పంటలు సాగు చేసుకోవాలని  కేసీఆరే  మాటలు నమ్మి అప్పోసప్పో చేసి కుటుంబ పోషణ కోసం పంట వేసుకుంటే, తీరా పంట చేతికొచ్చాక,అటవీ శాఖ అధికారులను, పోలీసులను పంపి దాడులు చేయించి పంటలను నాశనం చేయించడమే కాకుండా ఉల్టా కేసులు పెట్టి అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రశ్నించే అడవి బిడ్దలపై లాఠీ ఛార్జ్ చేయించడం బాదాకరంగా ఉందన్నారు. ‌కనీసం బాలింతలు, మహిళలని చూడకుండా దాడులు చేయించి కాళ్లు చేతులు విరగ్గొటి చేతులకు బేడీలు వేసి జైలుకు పంపడం ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు. 
మొన్న ఖమ్మంలో నిన్న మంచిర్యాల జిల్లా దండేపల్లిలోనూ అదే పరిస్థితి నెలకొందన్నారు.
పోడు భూముల రైతులేమైనా   ఫాంహౌజ్ భూములడుగారా? నీ కుదురుపాక లో ఉన్న స్థలాలను అడుగారా? ఎందకని వాళ్లపై ఎందుకింత రాక్షసత్వం ప్రవర్తించావని బండి ప్రశ్నించారు.
పైగా దళితులకు, పేదలకు ఇచ్చిన భూములను ఎందుకు లాక్కుంటున్నావో  సిఎం కేసీఆర్ బదులివ్వాలని ప్రశ్నించారు ‌? ప్రభుత్వ కార్యాలయాల పేరిట స్వాధీనం చేసుకుంటూ పేదల జీవితాలను కొట్టగొడతవా ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు
కు పేదల భూములే దొరికాయా అంటూ ఎద్దేవా చేశారు.టీఆర్ఎస్ నేతలు బరితెగించి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే నోరు విప్పని కేసీఆర్ పేదలు కుటుంబ పోషణ కోసం, గూడు కోసం స్థలాల్లో ఉంటే అక్రమమంగా దాడులు చేసి స్వాధీనం చేసుకుంటారా అంటూ బండి విమర్శించారు.
ఇప్పటికైనా సీఎం స్పందించి పోడు భూములు, ధరణి లోపాలపై స్పందించాలని, గతంలో ఇచ్చిన హామీని అమలు చేసి ప్రజల పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని, పేదలపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రాజన్న సిరిసిల్ల అధ్యక్షులు ప్రతాని రామక్రిష్ణ, రాష్ట్ర నాయకులు కటకం మ్రుత్యంజయం, రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ, నగర మాజీ మేయర్ డి.శంకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్పతోపాటు పలువురు జిల్లా నేతలు ఈ ‘మౌన దీక్ష’లో పాల్గొన్నారు.