జిల్లా కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Wednesday December 29, 2021
మంచిర్యాల బ్యూరో‌, డిసెంబర్ 28, ప్రజాపాలన : మంచిర్యాల లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హైటెక్ సిటీలోని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసగృహం ఆవరణలో పార్టీజెండా ఆవిష్కరించారు.అనంతరం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, ఫ్లోర్ లీడర్ ఉప్పలయ్య, జిల్లా కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ కాంగ్రెస్ ఇంచార్జ్ తూముల నరేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గార్ల ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఈ దిక్సూచిగా నిలిచిందని కొనియాడారు. స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ కీలక భూమిక పోషించిందని తెలిపారు. స్వాతంత్ర్యానంతరం దేశ స్వపరి పాలనలో కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో ప్రజారంజక పాలన సాగించిందని వారు గుర్తు చేశారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి ఉద్దండులు ఈ దేశానికి ఎనలేని సేవలు అందించారని వారు అన్నారు. దేశంలోని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి ఆచరణలో అమలు చేశారని వారు తెలిపారు. దేశానికి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా నిలుస్తుందని రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సంజీవ్, ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేశ్, పట్టణ ఉపాధ్యక్షుడు సదానందం, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కౌన్సిలర్ సల్ల మహేష్, యువజన కాంగ్రెస్  పట్టణ అధ్యక్షుడు షేర్ పవన్, నాయకులు కొండ శేకర్, పుదరి ప్రభాకర్, చింతకింది మల్లయ్య, బొల్లం భీమయ్య, సత్యం, గట్టు స్వామి, నల్ల ప్రవీణ్, కెయంఎస్ రెడ్డి, సురం సతీష్, రాజారావు, బుద్దర్ది శంకర్, సాంబయ్య, దుర్గయ్య, వెంకట్ సాయి, రామస్వామి, తోట సంతోష్, వేముల రమేష్, కృష్ణం రాజు, అజయ్, దుస్సా తిరుపతి, ఫార్వెజ్, మహేష్, ఇర్ఫాన్, మహిళ కార్యకర్తలు పుట్ట లావణ్య, హేమలత, లలిత, సరస్వతి,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.