సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిది : రమా వెంకటేష్ యాదవ్

Published: Thursday August 26, 2021
మేడిపల్లి, ఆగస్టు 25 (ప్రజాపాలన ప్రతినిధి) : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని బోడుప్పల్ నగరపాలక సంస్థ 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతో మందికి మేలుజరుగుతుందని, ఆపదలో ఉన్నవారికి ఆర్థికసహాయం తోపాటు మనోధైర్యాన్ని ఇస్తుందని అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్ లోని లబ్ధిదారులు బానోతులక్ష్మీకి 27.500, చంద్రయ్యకు 60వేల రూపాయలు చెక్కులను కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చేతులమీదుగా స్థానిక కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ కలిసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మేయర్ సామల బుచ్చి రెడ్డి, కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, కార్పొరేటర్ చీరాల నర్సింహా, తెరాస నాయకులు కాటేపల్లి రాంచంద్రారెడ్డి, బంధారం శ్రీధర్ గౌడ్, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.