ఐసోలేషన్ సెంటరును తనిఖీ చేసిన అధికారులు

Published: Tuesday May 25, 2021
సారంగాపూర్, మే 24 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండలంలో కరోనా రోగులకు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుకు చేసిన ఐసోలెషన్ కేంద్రాన్ని జిల్లా డిప్యూటీ వైద్యాధికారి ముస్కు జైపాల్ రెడ్డి సందర్శించి పరిశీలించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి ఎంపీడీఓ పుల్లయ్య సర్పంచ్ గుర్రాల రాజేందర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.