టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నేతలపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలి* రంగారెడ్డి జిల్లా కార్యదర్శి

Published: Saturday October 29, 2022

ఇబ్రహీంపట్నం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోమీడియా సమావేశంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మునికుంట్ల సంతోష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ...కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న అదరణ చూసి టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డిరంగారెడ్డి పై పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చెయడం నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రకటించడంవిడ్డూరంగా ఉందని వారు ఎద్దేవా చేశారు.మునుగోడులో టిఆర్ఎన్ పార్టీ ఓటమి భయం వెంటాడుతుంది అందుకే ఇతర పార్టీలపై పడి పై నిందలు వేస్తూ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలని చూస్తుందన్నారు.ఇక తెలంగాణ రాష్ట్రంలోటిఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లాయని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్రతో తెలంగాణలో పార్టీ మరింత పుంజుకోవడంతో తికమక గురైన కెసిఆర్ అలాగే వారి ఎమ్మెల్యేలు మంత్రులు మునుగోడులో కార్యకర్తల స్థాయిలో ప్రచారం చేయడంతోనే మునుగోడులో ఓటమిని కేసీఆర్ ఒప్పుకున్నట్లు అయిందన్నారు. ఇప్పటికైనా ఇతర పార్టీలపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు.