పునరుద్ధానుడు యేసుప్రభు: డా.కోట రాంబాబు ఈస్టర్ వేడుకల్లో పలు మందిరాలలో పాల్గొని ప్రార్థనలు

Published: Monday April 10, 2023

   బోనకల్ ఏప్రిల్ 9 ప్రజా పాలన ప్రతినిధి: ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలో పలు మందిరాలలో ఆదివారం ప్రార్థనలు ఘనంగా జరిగాయి. మండలంలోని కలకోట గ్రామంలో తెలుగు బాప్టిస్ట్ చర్చి కల్వరి టెంపుల్ నందు జరుగుతున్న ఈస్టర్ వేడుకలకు ప్రముఖ వైద్యులు జిల్లా నాయకులు డా.కోట రాంబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా డా.కోట రాంబాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుప్రభు పునరుద్ధానుడు అని పాపుల కొరకు ప్రాణం అర్పించి మరలా మూడవ రోజు తిరిగి లేచిన మహనీయుడు అని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ ఆ ప్రభు దీవెనలు ఉండాలని కోరారు. మందిరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డా.కోట రాంబాబుని తెలుగు బాప్టిస్ట్ చర్చి యువత, కల్వరి టెంపుల్ పాస్టర్స్ ఘనంగా సన్మానించారు.