రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చెయ్యండి

Published: Thursday December 22, 2022

శంకరపట్నం డిసెంబర్ 21 ప్రజాపాలన్ రిపోర్టర్:

ఖమ్మం జిల్లా కేంద్రంలోని
వరకు బిజిఎన్అర్ కళాశాల గ్రౌండ్లో డిసెంబర్ 29 నుండి 31 జరగబోయే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభలు బహిరంగ సభకు మండలంలోని కార్మికులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వ్యవసాయాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు బుధవారము ఓ  ప్రకటనలో తెలిపారు. ఈ మహాసభలకు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ముఖ్యఅతిథిగా రానున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ప్రజాప్రతినిధులు వివిధ రంగాల ప్రముఖులు  హాజరు కానున్నట్లు ఆయన తెలిపారు. శంకరపట్నం మండలం లోని అన్ని గ్రామాల్లోని వ్యవసాయాయ కార్మికులు  రైతులు పాలుగొనాలని ఆయన పిలుపునిచ్చారు.