ఘనంగా ఏ.ఐ.ఏ.వై.ఎస్ జాతీయ కార్యదర్శి ముద్దం ప్రకాష్ జన్మ దిన వేడుకలు

Published: Saturday March 13, 2021
జగిత్యాల, మార్చి 11 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామంలో ఏ.ఐ.ఏ.వై.ఎస్ (ఆల్ ఇండియా అంబెడ్కర్ యువజన సంఘం) జాతీయ కార్యదర్శి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఎస్సి ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముద్దం ప్రకాష్ జన్మదిన వేడుకలు బుధవారం నాడు మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీనికి ముందు జగిత్యాల జిల్లా కేంద్రంలో వాల్మీకి ఆవాసం, టిఆర్ నగర్ వృద్ధాశ్రమంలో జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో పండ్లు పాలహారాలు పంపిణీ చేశారు. ముద్దం ప్రకాశ్ మాట్లాడుతూ మనమందరం పూలే అంబేద్కర్ మహనీయుల బాటలో నడుస్తూ అన్ని కులాలు మతాల వారితో సక్యంగా కలిసికట్టుగా ఉంటూ బలమైన బహుజన సమాజ నిర్మాణం చేయాలని మనందరి సమస్యల పరిష్కరం కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈకార్యక్రమంలో మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు నర్ర రాజు, కార్యదర్శి చింతకుంట్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి మ్యాదరి శ్రీహరి, కోశాధికారి కుంటే అంజయ్య, పట్టణ అధ్యక్షులు కడమండ కమలాకర్, కార్యవర్గ సభ్యులు మ్యాదరి రమేష్, చింతకుంట నడిపి గంగాధర్, నీరటి వెంకటేష్, చిత్తరి నారాయణ, మ్యాదరి సంజీవ్, జక్కుల దేవయ్య, పోతుల లక్ష్మీ నర్సయ్య, ప్రజాపాలన జాతీయ తెలుగు దినపత్రిక మరియు స్నేహ టివి ఛానల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బోడ మనోహర్ నంద, జిల్లా మీడియా సెల్ కన్వీనర్ నీరటి గంగధర్, శ్రీకాంత్ మరియు జిల్లా ప్రధాననాయకులు పాలుగొన్నారు.