వేంకటేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ కృష్ణజన్మష్టమి ఉట్టి కొట్టువెడుక...

Published: Thursday September 02, 2021
పాలేరు సెప్టెంబర్ 1 ప్రజాపాలన ప్రతినిధి : శ్రీ కృష్ణజన్మష్టమి సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ బొడ్డు నరేందర్, ఈఓ నారాయణా చార్యులు ఆధ్వర్యంలో జీళ్ళచేరువు మెయిన్ రోడ్  ఆర్చి  వద్ద  ఉదయం 11:00 గం౹౹లకు  ఉట్లు కోట్టుట నిర్వహించారు. గ్రామ యాదవులు ఉట్లు కొట్టినారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు బూర్లే వీరబాబు, ఆశా కుమారి, అర్చకులు స్వామినాద్, జూనియర్ అసిస్టెంట్ రామదాసు, యాదవులు మెట్టెల పుల్లయ్య, సర్వయ్య, గోవిందు రాంబాబు, లింగయ్య, అశోక్ వినోద్, గ్రామ పెద్దలు గోపగాని వీరబాబు, బాలేబొయిన రమేష్, ఐతగాని రాజీవ్, మండవ బుడ్డు, కొండ వీరబాబు, సాయి తదితరులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.