రోడ్డు మరమ్మతులు చేయిస్తున్న ఎస్ఐ

Published: Thursday September 09, 2021
సెప్టెంబర్ 08 వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని నాగారం ఖమ్మగూడెం మధ్యలో ఉన్న రోడ్డు ఇటీవల కురిసిన వర్షానికి కోతకు గురై ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించి స్థానిక ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ స్పందించి వెంటనే మట్టి పోయించి డోజర్లతో లెవెల్ చేయించి ప్రమాదాలు జరగకుండా రోడ్ మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ వర్షాల వల్ల రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వస్తే రోడ్డు మరమ్మతులు చేయించి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చని ఆయన అన్నారు.