మత్స్యగిరి ఆలయంలో స్వాతి కళ్యాణం

Published: Wednesday May 26, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల శ్రీ మత్స్యగిరి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం గుట్ట పైన మంగళవారం రోజున నృసింహ జయంతి సందర్భముగా లోక కల్యాణం మరియు కరోనా వ్యాధి నివారణ తొందరగా జరిగి ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ, శ్రీ స్వామి వారికి సుగంధ ద్రవ్యములతో ప్రత్యేక అభిషేకం, స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ స్వామి వారి కళ్యాణం అర్చకులచే అంతరంగికముగా  నిర్వహించబడినది. స్వామి వారి సేవలో, చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి కె రవికుమార్, ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు