ఆశా కార్యకర్తలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Published: Friday June 04, 2021

బెల్లంపల్లి, జూన్ 3, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా కష్టకాలంలో గ్రామాల్లో ఆశా కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం నాడు ఆయనవారికి నిత్యవసర వస్తువులు పంపిణీ చేసిన అనంతరం  మండలంలోని తాళ్ల గురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా ఉదృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వైద్య సిబ్బంది తో పాటు ఆశా కార్యకర్తలు తమ ప్రాణాలకు వెనకాడకుండా పనిచేయడం ఎంతో హర్షించదగిన విషయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, మండల ఎంపీటీసీలు, గురజాల సర్పంచ్ రజిత వెంకటేష్ గౌడ్, మండల సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు తెరాస నాయకులు లక్ష్మణ్, మెడికల్ ఆఫీసర్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.