రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి

Published: Wednesday October 13, 2021
యాదాద్రి అక్టోబర్ 12 వలిగొండ ప్రజాపాలన ప్రతినిది వలిగొండ నుండి వేములకొండ వెళ్లే రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని స్థానిక టిఆర్ఎస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తాత్కాలికంగా రోడ్లను మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కంకల కిష్టయ్య అన్నారు. మంగళవారం ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో లోతుకుంట కల్వర్టు వద్ద నిరసన తెలిపి మాట్లాడుతూ ధ్వంసమైన రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇటీవల నిరసన తెలిపి శ్రమ దానం చేపడితే టిఆర్ఎస్ యువజన నాయకులు అవగాహన లేదు అనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని,ప్రయాణికులు ఈ రోడ్లపై ప్రయాణం చేసే టప్పుడు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని ప్రయాణం  చెయ్యాల్సి వస్తుందని, ఈ రోడ్డుపై ఎలాంటి ప్రమాదాలు జరిగిన స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరించారు. పండుగ సమయంలో రాత్రి వేళల్లో ప్రయాణికులు జాగ్రత్తగా ప్రయాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోతుకుంట సర్పంచ్ రాచకొండ బచ్చయ్య నాయకులు కాసుల వెంకన్న, గరిసే రవి, బత్తిని సహదేవ్, బత్తిని పాండు, పల్లెర్ల రాజు, బత్తిని సైదులు తదితరులు పాల్గొన్నారు.