కేశపట్నంలో జోరుగా పందుల స్వైర విహారం పట్టించుకోని అధికార యంత్రాంగం

Published: Saturday December 17, 2022
శంకరపట్నం డిసెంబర్ 16 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండలం కేశపట్నం గ్రామంలో  పందుల స్వైర విహారం రోజురోజుకి పెరిగిపోతుంది. పంట పొలాల్లో తిరుగుతూ పంటలను నాశనం  చేస్తున్నాయని వీటి వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే విత్తుకున్న వరి నారుమడులలో పందులు గుంపులు  గుంపులుగా తిరుగుతూ నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుమార్లు పందుల పెంపకం దారులకు, గ్రామపంచాయతీ అధికారులకు, చెప్పినప్పటికీ పట్టించుకోవడంలేదని వారు వాపోయారు. మండల కేంద్రమైనప్పటికీ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుపోవడం నివారణ చర్యలు  చేపట్టకపోవడాన్ని రైతులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. మండల తాసిల్దార్ ఇప్పటికైనా స్పందించి శాఖాపరమైన చర్యలు, సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేయాలని స్థానిక రైతాంగం కోరుతున్నారు.