నాంపల్లి కోర్టు లో 1539 మంది న్యాయవాదులకు ఆరోగ్య కార్డులను అందజేసిన తెలంగాణ ప్రభుత్వం....

Published: Wednesday June 15, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
  తెలంగాణ అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రతి యేటా జారీ చేసే ఆరోగ్య కార్డులను ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రతినిధులకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ మెడిసేవ ఆఫీసర్ వెంకట్ తదితరులు అందజేసారు. గత నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల ఆరోగ్య కార్డుల రెన్యూవల్ కొరకు 6 కోట్లు విడుదల చేయడం జరిగింది.ఇంతకు ముందు నాంపల్లి కోర్టు లో ఈ ఆరోగ్య కార్డులు కలిగివున్న 1539 మంది న్యాయవాదులకు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన కార్డులను ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధుల నుండి ఈ రోజు నాంపల్లి బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీ జక్కుల లక్ష్మణ్ స్వీకరించారు. అదేవిదంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.