పాదయాత్ర కు రూట్ మ్యాప్ ను పరిశీలించిన పలువురు బిజెపి నేతలు

Published: Wednesday August 11, 2021
బాలాపూర్: ఆగస్టు10, ప్రజాపాలన ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాదయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించన పాదయాత్ర కమిటీ సభ్యులు. మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జి కంటెస్టెంట్ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు తో కలసి పలువురు నాయకులు ఈనెల 24న పాదయాత్ర ప్రారంభం కానుందిని అన్నారు. భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి   షేక్ పేట్, గోల్కొండ ప్రాంతాల్లో రూట్ మ్యాప్, వసతి, భోజన ఏర్పాట్ల స్థలాలను పరిశీలించారు కమిటీ సభ్యులు. ఈ పాదయాత్ర రాబోయే 2023 సంవత్సరములలో మహేశ్వరం నియోజకవర్గంలో, తెలంగాణ రాష్ట్రంలో ప్రగతిభవన్ పై కాషాయం జెండా ఎగరేయటమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగిస్తున్నారని తెలిపారు.