జన నాయకుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి -- గిర్కాటి నిరంజన్ గౌడ్
Published: Saturday September 24, 2022
చౌటుప్పల్, సెప్టెంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి): నిరంతరం ప్రజా సమస్యలను తీర్చే మనసున్న ప్రజా నాయకుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని తెరాస చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షులు గిర్కాటి నిరంజన్ గౌడ్ అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మండల కేంద్రంలో ఎరువుల గోదాం మరియు సింగిల్ విండో కార్యాలయం ప్రహరీ గోడ నిర్మాణంకు హాజరైన మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి. తెరాస చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షులు
గిర్కాటి నిరంజన్ గౌడ్ చౌటుప్పల్ మండలంలోని వివిధ రైతులు తమ బావుల వద్ద కరెంటు స్తంభాలు లేక ఇబ్బందులు పడుతున్నారని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా. వెంటనే స్పందించిన కూసుకుంట్ల కరెంటు డిఈ తో చరవాణిలో మాట్లాడి మంజూరు చేయించడంతో రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం లో బడుగు బలహీన వర్గాల ప్రజలు, రైతులు, ఎలాంటి సమస్యలు వచ్చిన అట్టి సమస్యలను తీచుతున్న వ్యక్తి కేవలం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని అన్నారు. గతంలో మునుగోడు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గానికి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.
Share this on your social network: