సిపిఎం పార్టీ బోనకల్లు గ్రామం మహాసభ
Published: Monday August 02, 2021
బోనకల్లు, ఆగస్టు 01, ప్రజాపాలన ప్రతినిధి : సిపిఎం పార్టీ బోనకల్లు గ్రామం మహాసభ కామ్రేడ్ మంద కళావతి అధ్యక్షతన కామ్రేడ్ చెన్నా లక్షా ద్రి ఇంటివద్ద నిర్వహించడం జరిగింది. మహాసభ ప్రారంభానికి ముందుగా పార్టీ జెండా ని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బోనకల్ గ్రామ మాజీ సర్పంచ్ భూక్య జాలు జండా ఎగరవేశారు. అనంతరం జరిగిన మహాసభ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కథ నాలుగు సంవత్సరాల నుంచి జరిగినటువంటి ప్రజా పోరాటాలను సిపిఎం పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాల గురించి నివేదికను సిపిఎం పార్టీ బోనకల్ గ్రామ కార్యదర్శి లక్షా ద్రి చదివి వినిపించారు. అనంతరం నూతన గ్రామ కార్యదర్శి గా తెల్లకుల శ్రీనివాస రావు నీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ బోనకల్ మండలం కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, పార్టీ గ్రామ శాఖ సభ్యులు పాల్గొన్నారు.
Share this on your social network: