కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మల దగ్ధం

Published: Monday October 04, 2021
కోరుట్ల, అక్టోబర్ 03 (ప్రజాపాలన ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో శనివారము హైద్రాబాద్లో జరిగిన "విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్" కార్యక్రమంలో భాగంగా తెలంగాణా అమరవీరులకు నివాళులు అర్పించటానికి వెళ్ళిన తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని హౌస్ అరెస్ట్ చేయడం, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మాధుయాష్కీ గౌడ్ ని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అక్రమ అరెస్ట్ చేయడానికి నిరసనగా, టీపీసీసీ పిలుపు మేరకు మరియు కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావు ఆదేశాల మేరకు ఆదివారం రోజున కేసిఆర్, మరియు కేటీఆర్ ల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సంధర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఎన్నికల హామీలలో నిరుద్యోగులగు ఉద్యోగాలని భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చిందని, ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తానని హామీ ఇచ్చిందని, ఈప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, విద్యార్థులని, నిరుద్యోగులను మోసం చేసిందని, తక్షణమే నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగులను భర్తీ చేయాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు తిరుమల గంగాధర్, జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్ గౌడ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గడ్డం వెంకటేష్ గౌడ్, తుపాకుల భాజన్న, మాజీ కౌన్సిలర్ సోగ్రాభి, పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి మేకల నర్సయ్య, కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ రంజిత్ గుప్తా, పన్నాల అంజిరెడ్డి, లక్ష్మణ్ సుమన్, కోట గంగాధర్, గడెల అశోక్, వాసం అజయ్, శ్రీను, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.