కేశపట్నం పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట
Published: Friday December 16, 2022
శంకరపట్నం డిసెంబర్ 15 ప్రజాపాలన రిపోర్టర్:
ధర్మారం గ్రామానికి చెందిన అరవింద్ అనే యువకుడు హుజురాబాద్ పట్టణానికి చెందిన ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. కొద్దిరోజుల క్రితం వారి తల్లిదండ్రులకు వారి ప్రేమ విషయం చెప్పగా ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్ళికి నిరాకరించారు. ఈరోజు సుందరగిరి ఆలయంలో వారు పెళ్లి చేసుకుని కేశపట్నం పోలీసులను ఆశ్రయించారు ఏఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు ఇరువర్గాలకి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రేమ జంటకు ధైర్యాన్ని ఇచ్చారు.
Share this on your social network: