దొంత మాల కిషోర్ కు మధిర వై ఎస్ ఆర్ టి పి బాధ్యతలు

Published: Saturday October 09, 2021
మధిర, అక్టోబర్ 08, ప్రజాపాలన ప్రతినిధి : మధిర నియోజకవర్గ వై ఎస్ ఆర్ టి పి బాధ్యతలను ఆ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల దొంత మాల కిషోర్ కుమార్ కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రానున్న 2023 ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల స్థాయిలో ఆ పార్టీ ప్రధానంగా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాతో పాటు మధిర నియోజకవర్గంలో సత్తా చాటేందుకు గాను నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తూ పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో పటిష్టమైన ప్రణాళికతో ముందడుగు వేసేందుకు గాను త్వరలోనే రాజకీయ పర్యటనల రూట్ మ్యాప్ ను పార్టీ అధినేత్రి షర్మిల ప్రకటించనున్నారు. మధిర నియోజకవర్గానికి స్థానికు డు విద్యావంతుడైన దొంత మాల కిషోర్ కుమార్ ను నియోజకవర్గ ఇన్చార్జిగా నియమిస్తూ పార్టీ విస్తరణ బాధ్యతలను అప్పగించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకిచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడంతో పాటు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనలో అడుగేస్తూ ఆయన సంక్షేమ పాలనను మరోసారి ప్రజలకు అందించేందుకు షర్మిలమ్మ చేస్తున్న సంకల్పానికి ప్రజల్లో మద్దతు కూడగట్టడం, పార్టీని బలోపేతం చేయడం కోసం తన వంతు బాధ్యతతో కూడిన పాత్రను నిర్వహిస్తానని దొంతమాల కిషోర్ పేర్కొన్నారు.