బిసి కమీషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ ను ఘనంగా సన్మానం

Published: Wednesday September 29, 2021
తెలంగాణ రాష్ట్ర తమ్మలి సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి
వికారాబాద్ బ్యూరో 28 సెప్టెంబర్ ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్ర బిసి కమీషన్ సభ్యులు నూలి శుభప్రద్ పటేల్ ను ఘనంగా సన్మానించామని రాష్ట్ర తమ్మలి సంఘం ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి అన్నారు. మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లిలోని బిసి కమీషన్ సభ్యులు స్వగృహంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి పూలమాలాలంకృతం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తమ్మలి సంఘం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ..జిఓ నంబర్ 7లో తమ్మలి సామాజిక వర్గానికి చెందిన శూద్ర నాయి బ్రాహ్మణ్ అసంకల్పిత పదాలు రికార్డుల్లో నమోదయ్యాయని పేర్కొన్నారు. అసంకల్పిత పదారను రికార్డుల్లో నుండి తొలగించి తమ్మలి సామాజిక వర్గానికి న్యాయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర బిసి కమీషన్ సభ్యులు స్పందిస్తూ..జిఓ నంబర్ 7లో నమోదైన అసంకల్పిత పదాలను తొలగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తమ్మలి సంఘం ఉపాధ్యక్షుడు విఠల్, వికారాబాద్ జిల్లా తమ్మలి సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, తమ్మలి సంఘం సభ్యులు రాజేందర్, రమేష్, సత్యనారాయణ, సంగయ్య, వెంకటేశం, బిచ్చన్న, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.