నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించారు

Published: Wednesday January 12, 2022

ఇబ్రహీంపట్నం జనవరి 11 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల పరిధిలో వివేకానంద స్ఫూర్తితో ఇబ్రహీంపట్నం రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో క్రీడలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షులు ఎం పి పి కృపేశ్ ఎంపీడీవో మహేష్ బాబు, కలిసి క్రీడలు కొనసాగించారు యువతకు క్రీడల ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీపీ కృపెష్ అన్నారు. మండల పరిధిలో ఉన్న వివిధ గ్రామాల క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జిల్లా స్థాయి నుంచి రాష్ట్రం వరకు క్రీడలో నైపుణ్యం పొందాలని వారి ప్రతిభను కనబరచాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ యూత్ ఆఫీసర్ ఇజ్జయత్, సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ రఘునందన్ రావు,  వైస్ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి,  ఎస్ ఎఫ్ డి రంగారెడ్డి జిల్లా కన్వీనర్ సందీప్, టిఆర్ఎస్ మండల కార్యదర్శి గంగిరెడ్డి భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.