వ్యక్తి అదృశ్యం

Published: Sunday October 10, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మండల పరిధిలోని సుంకిశాల గ్రామానికి చెందిన భవాని కి 2012లో చౌటుప్పల్ కు చెందిన సురకంటి లింగారెడ్డి తో వివాహం జరిగింది.వీరికి ఇద్దరు సంతానం భార్యాభర్తలు సుంకిశాల గ్రామంలో నే నివాసముంటున్నారు. ఈనెల 4వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు భర్త లింగారెడ్డి ఇంటి నుండి కనబడకుండా వెళ్ళిపోయాడు. భార్య భవాని ఇచ్చినా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాఘవేంద్ర గౌడ్ తెలిపారు.