రాష్ట్ర ప్రగతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
Published: Wednesday October 13, 2021
ఆలంపల్లి మైనారిటీ సెల్ కాంగ్రెస్ నాయకుడు హాజి పాష
వికారాబాద్ బ్యూరో 12 అక్టోబర్ ప్రజాపాలన : రాష్ట్ర ప్రగతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంలని ఆలంపల్లి మైనారిటీ సెల్ కాంగ్రెస్ నాయకుడు హాజీ పాష అన్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లి, ధన్నారం గ్రామస్థులు మహమ్మద్ రఫీ, అఫ్జల్, షరీఫ్, ఉమర్, సలీమ్, జాఫర్, ఆహ్మద్, మోయిన్, మోయిజ్, జాని, సాజిద్, వాజిద్, రవి, వెంకట్, రాజు, నర్సిములు లతో కలిసి హైదరాబాద్ లోని టిపిసిసి అధ్యక్షులు మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా హాజీ పాష మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వంలో మైనారిటీలకు సరైన గుర్తింపు లేదని పేర్కొన్నారు. మైనారిటీలను టిఆర్ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే చూస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రగతి మెట్లు సాధిస్తుందని వివరించారు. ఇంత వరకు మైనారిటీలకు లబ్ది చేకూరిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ పుణ్యమేనని కొనియాడారు.
Share this on your social network: