ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 7ప్రజాపాలన ప్రతినిధి *ఎమ్మార్వోపై జయశ్రీ చేస్తున్న ఆరోపణలు అవాస
Published: Thursday December 08, 2022
అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లిలోని సర్వే నెంబర్ 67 లో ని1ఎకరం 35 గుంటల భూమి విషయంలో బత్తుల జయశ్రీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటా చారి, తహసీల్దార్ అనితారెడ్డి లు అన్నారు. తుర్కయంజా ల్ లోని ఇబ్రహీం పట్నం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్ అనిత లు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1ఎకరం35 గుంటల భూమి విషయంలో భూమిపై జయశ్రీకి ఎలాంటి హక్కులు చెల్లవని పేర్కొన్నారు. సర్వే నెంబర్ 67లో మొత్తం 7ఎక రాల25గుంటల భూమికి సుర్వి మల్లయ్య పట్టాదారుడు అని, ఆయన మరణం అనంతరం సాదా బైనామా ద్వారా కుమారులు అమ్ముకున్నారని తెలిపారు. ఇలా అరకొర విషయాలు తెలుసుకుని రెవెన్యూ అధికారులపై లేనిపోని ఆరోపణలు మోపి మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు.
Share this on your social network: