సి ఎం సహాయనిది చెక్కులను అందించిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Tuesday December 13, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు, 12 లక్షల 68 వేల ముఖ్యమంత్రి, సహాయనిది చెక్కు లను, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కార్యాలయంలో సోమవారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గొమాస శ్రీనివాస్, కన్నెపల్లి జెడ్పిటిసి సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఎంపిటిసి శ్రీదేవి, కౌన్సిలర్లు రమేష్, నీలి కృష్ణ, కొక్కెర చంద్రశేఖర్, నెన్నెల మండల కోఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, కిరణ్, పట్టణ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నూనేటి సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.