సీడీపీ నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే సంజయ్ కి కృతజ్ఞతలు...

Published: Monday February 27, 2023
బీరుపూర్, ఫిబ్రవరి 26 (ప్రజపాలన ప్రతినిధి):  బీరుపూర్ మండల్
రంగాసాగర్ గ్రామంలో గొల్ల కేతమ్మ జాతర ఉత్సవాలకు కరెంట్ సౌకర్యం కోసం ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు నాయకులు భక్తులు ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ గారికి విజ్ఞప్తి చేయగా వెంటనే స్పందించి సీడీపీ నిధులు రూ. 4.8 లక్షలు మంజూరు చేయించి కరెంట్ లైనింగ్ పనులు పూర్తి చేయించిన ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ గారికి బీర్పూర్ రాయికల్ మండలాల నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేడీసీసి డైరెక్టర్ ముప్పాల రాంచందర్ రావు ఏడిఈ హరీష్ ఏఈ శ్రీనివాస్ గ్రామ సర్పంచ్ బోడ స్వప్నసాగర్ కట్కాపూర్ గ్రామ సర్పంచ్ రాజమౌళి ఎక్స్ జడ్పిటిసి ముక్క శంకర్ పార్టీ మండల అధ్యక్షుడు నారపాక రమేష్ సర్పంచులు పర్వతం రమేష్ చుంచు శారదనరేందర్  బనుక శంకర్ మైదం గంగరాజం తదితరులు పాల్గొన్నారు.