కాంగ్రెస్‌ వినూత్న నిరసన.. గోపాలపురంలొ శ్రమదానం..

Published: Wednesday October 13, 2021
ఖమ్మం అక్టోబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి : ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు పట్టణ. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగు పర్చాలని. వ్యాదుల బారిన పడకుండ చర్యలు తీసుకోవాలని కోరుతు కాంగ్రెస్‌ పార్టి నాయకులు కార్యకర్తలు ఖమ్మం నగరం లోని 8 వ డివిజన్ పరిధిలోని గోపాలపురం ఎరియలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు చెత్త చెదారం తొలగించటం తోపాటు ఇతర పలు శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న పంచాయతీరాజ్ అభియాన్ వర్క్ షాప్ కోఆర్డినేటర్ ఎస్ శశికాంత్ సెంథిల్. పార్టి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వు వాళ్ళ దుర్గాప్రసాద్ ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టి పాలన సాగిస్తున్న పాలక నేతలకు గుణపాఠం చెప్పాలనీ కోరారు. శ్రమదానం కార్యక్రమాల తొ ప్రబుత్వం అనుసరించే ప్రజా వెతిరెక విధానాలను నిరసించాలని కోరారు. కార్యక్రమంలొ కాంగ్రెస్‌ ఖమ్మం నగర అధ్యక్షులు జావిద్. ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ కాంగ్రెస్ పార్టీ 10 డివిజన్ల కార్పొరేటర్లు లకావత్ సైదులు మాలీదు వెంకటేశ్వర్లు, పల్లెబోయిన భారతి, ఘనాల రాధా. కొత్త సరిత .మిక్కిలి నరేంద్ర  శ్రావణి రఫీ దా బేగం బద్దం నిరంజన్ పాల్గొన్నారు