మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ పొంగులేటి

Published: Saturday December 17, 2022
బోనకల్, డిసెంబర్ 16 ప్రజా పాలన ప్రతినిధి: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం బోనకల్ మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ముష్టికుంట్ల గ్రామంలో జరిగిన గుడిద రాములు, బంధం హుస్సేన్ తనయులు మహేష్, అనిల్ కుమార్ ల వివాహ వేడుకకు హాజరై పెళ్లి కుమారులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలను అందించారు. అనంతరం చొప్పకట్లపాలెం గ్రామానికి చెందిన దారగాని నారాయణ తనయుడు వినయ్ వివాహా వేడుకకు హాజరై పట్టువస్త్రాలను కానుకగా అందజేశారు. అనంతరం మండల కేంద్రమైన బోనకల్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న గుడిమళ్ల వెంకయ్యను పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట జిల్లా నాయకులు బొమ్మెర రామ్మూర్తి, డాక్టర్ కోటా రాంబాబు, సర్పంచులు తిరుమలరావు, భూక్య సైదానాయక్, చిలకా వెంకటేశ్వర్లు, నాయకులు ఉమ్మనేని కృష్ణ, కన్నెటి సురేష్, బండి వెంకటేశ్వర్లు, తోటకూర వెంకటేశ్వరరావు, పర్సగాని గోపి, కోయినేని ప్రదీప్, ఎస్.కె. చాంద్ పాషా, బోయినపల్లి మురళి, సాధినేని రాంబాబు, బంధం నాగేశ్వరరావు, బాలకృష్ణ, గాదె నరోత్తమరెడ్డి, ఊటుకూరి బాలకృష్ణ, చిట్టిమోతు శ్రీను, షేక్. పాషా, గుడిద వీరబాబు, మోదుగు కోటయ్య, వడ్డెబోయిన సతీష్, గాలి కృష్ణ, బోయినపల్లి వెంకటేశ్వర్లు, తన్నీరు పుల్లారావు, సాయి, పర్సగాని నాగరాజు, కొంకిమల్ల బాలు తదితరులు ఉన్నారు.