రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
Published: Wednesday February 17, 2021
మల్లాపూర్, ఫిబ్రవరి16 ( ప్రజాపాలన ) : మల్లాపూర్ మండల కేంద్రంలో మండల గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం కోరుట్ల స్థానిక నియోజవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేతుల మీద గా రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ నిర్మాణభూమి రిజిస్ట్రేషన్ లోపాలు ఉంటే ఇరువురు పరిష్కరించుకొని గౌడ సంఘం సభ్యులందరు సమిష్టిగా అలయనిర్మాణంలో సేవాలందిస్తూ అలయ నిర్మాణాన్ని తరగతిన పూర్తి చేయాలని అన్నారు. కల్లుగీత కార్మికుల కోసం ఈత, తాటి చెట్ల పెంపకానికి 5 ఎకరాల్లో భూమిని చూపించాలంటూ గౌడ సభ్యులు ఎమ్మెల్యేను కోరగా ఎమ్మెల్యే తహశీల్దార్ ను భూమిని చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సందిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కాటిపేల్లి సరోజన - ఆదిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కదుర్క నర్సయ్య, వైస్ ఛైర్మన్ శరత్ గౌడ్, తహశీల్దార్ రమేష్, ఆనంద్ గౌడ్, ముద్దం ప్రసాద్ గౌడ్, లింగస్వామి గౌడ్, ముద్దం సత్యనారాయణ గౌడ్, నాయిని అంజయ్య గౌడ్ మండల గౌడ సంఘము సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: