ఇబ్రహీంపట్నంలో ఎగిరేది కాంగ్రెస్ జండే ధీమా వ్యక్తం చేసిన కౌన్సిలర్ సునీల్

Published: Thursday July 28, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 27 ప్రజాపాలన ప్రతినిధి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ  కౌన్సిలర్ కాకుమాను సునీల్ బుధవారం రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరంగల్ డిక్లరేషన్ తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని విజృంభించేలా పేదల సమస్యలపై నిరంతరం అధికార పార్టీపై ధ్వజమెత్తుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ గతంలో రాజీవ్ గాంధీ గృహకల్ప ఇండ్లు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది అన్నారు. నిరుపేదల కోసం సొంతంగా ఇల్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆ పేరుని వాడుకొని డబల్ బెడ్ రూమ్ పేర్లతో పేరు మార్చి కెసిఆర్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారని అన్నారు. నేటి తెరాస ప్రభుత్వం పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు, దళితుడికి మూడెకరాల భూమి ఇస్తానని మభ్యపెట్టిన కెసిఆర్ ను గద్దతింపే రోజులు దగ్గరపడ్డాయని అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కి తగు బుద్ధి చెప్తారని తెలిసి చెప్పారు. రాబోయే రోజుల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో రెపరెపలాడేది కాంగ్రెస్ జెండా అని కౌన్సిలర్ కాకుమాను సునీల్  తెలిపారు.