పరోపాకారం మహా ద్యేయం: వాసిరెడ్డి రామనాదం

Published: Wednesday April 28, 2021
మధిర, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో  రోజు ఉదయం 8 గంటలకు మధిర పట్టణంలో ఆజాద్ రోడ్డు నందు ప్రముఖ సామజిక సేవా కార్య కర్త లంకా కొండయ్య నివాస ప్రాంగణంలొ ఏర్పాటు చేసిన వికలాంగుల వితంతు సేవలో భాగంగా స్థానిక మధిర రామనాధo ఏరియా లో నివాసం ఉంటున్న రైతు బిడ్డ మోటార్ మెకానిక్ శ్రీ జమ్ములు కోటేశ్వరావుగారి కుమారుడు జమ్ముల సాధ్వి చౌదరి జన్మదిన సందర్బంగా లంకా కొండయ్య సూచించిన నిరుపేద విక లాంగుల కుటుంబం నిదనాపురం నివాసి మరియు అంబారుపేట  చెరువులో మునిగి చనిపోయిన పెయింటర్ కుటుంబంనకు ఒక నెలకు సరిపడా కిరాణా సరుకులు  బియ్యం dr రామనాధం చేతులు మీదుగా అందించారు. ఈ సందర్బంగా dr రామనాధo మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ఇలాంటి దాత్రత్వ కార్యక్రమం చేపట్టటం అభినందనియo అని తెలిపినారు. అదే విధంగా ఆశ భాధితుల పునరావాస సేవా సహాయ కేంద్రం ఏర్పాటు చేసి ఇలాంటి అభాగ్యులను ఆదుకోవటం అభినందనియo అని జమ్మల కోటేశ్వరావు, కొండయ్యలను అభినందించారు. ఈ కార్యక్రమంలొ వీరమాచినేని శ్రీనివాసరావు రాష్ట్ర టీడీపి నాయకులు మల్నిడు జగన్మోహనరావు జమ్ముల కోటేశ్వరరావు, లంకా సేవా ఫౌండేషన్ వాలంటీర్లు కరుణా లియోనా, శ్యామ్, రెమల్లి కోటేశ్వరావు, ఆదిమూలం  వెంకటేష్, కిరణ్, అంజి, గోపి, సాయి పాల్గొన్నారు.