పార్స్ ఏ.పీ స్టేట్ PARS గుంటూరు వెస్ట్ అసెంబ్లీ కు వైస్ ప్రెసిడెంట్ గా Sk అఫ్రోజ్ నియామకం

Published: Wednesday August 03, 2022

ఆగష్టు 02  ప్రజాపాలన ప్రతినిధి : పూలే అంబేడ్కర్ రాజ్యాధికారి సమితి PARS గుంటూరు వెస్ట్ అసెంబ్లీ కి వైస్  ప్రెసిడెంట్ గా Sk అఫ్రోజ్ నియమితులయ్యారు.ఈ మేరకు PARS ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్ కటికల రవి కుమార్ ,    షేక్  అఫ్రోజ్ ను  నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  వీరు గుంటూరు అసెంబ్లీ పరిధిలొ రాజకీయ అవగాహన ఉన్న ముఖ్య నాయకులతో కమిటీలను నియమించడంతో పాటు బహుజన వాదాన్ని బలపరిచే వివిధ రంగాలలో పని చేస్తున్న వారిని పార్స్ అనుబంధ సంఘాలుగా వీరి పరిధిలొ నియమించిరెండు విభాగాల మధ్య సమన్వయ పరిచి వారందరి సహకారంతో బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని ఈ సంధర్బంగా ఆయన పేర్కొన్నారు. షేక్  అఫ్రోజ్ నియామకం పట్ల పలువురు బహుజనులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేసారు.