తెలంగాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ కాజ శరత్ కి జేడీ ఫౌండేషన్ సన్మానం.

Published: Monday November 07, 2022
భద్రాచలం ( ప్రజా పాలన.)
 భద్రాచలం వాస్తవ్యులు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లో న్యాయమూర్తి ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టి, సొంత ఊరు కి విచ్చేసిన జస్టిస్. శ్రీ కాజ శరత్ కి భద్రాచలం పట్టణంలో, పురప్రముఖులు కూనవరం రోడ్డులో ఉన్నటువంటి వీరభద్ర ఫంక్షన్ హాల్ నందు పౌర సన్మానం ఏర్పాటు చేసిన సంగతి విదితమే, ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జస్టిస్. కాజ శరత్ దంపతులను ఘనంగా సన్మానించడం జరిగింది,ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్ కన్వీనర్ మురళీ మోహన్ కుమార్ తెలుపుతూ,న్యాయ మూర్తి గా అనేక సేవలు చేసి ఉన్నత పదవి చేపట్టి పుట్టిన ఊరి కి మంచి పేరు తీసుకురావడం గర్వకారణం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు హన్సి,  వేమూరి పవన్ ,కడాలి నాగరాజు, యూసుఫ్ మియా తదితరులు పాల్గొన్నారు.