రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయానికి రూ.లక్ష విరాళం

Published: Monday March 15, 2021
బి.జె.పి రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి
వెల్గటూర్, మార్చి 14 (ప్రజాపాలన ప్రతినిధి): వెల్గటూర్ మండలం కొండాపూర్ గ్రామంలోని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణం కోసం మాజీ ఎం.పీ బీ.జే.పీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి లక్ష రూపాయల విరాలన్ని ఆదివారం గౌడ సంఘ సభ్యుల కు అందజేశారు. అదేవిధంగా ఎండపల్లి ఎం.పి.టి.సి బీ.జే‌పీ రాష్ట్ర నాయకులు ఎం.డి బషీర్ ఇరవై వేలు,అంబారిపేట ఎం.పి.టి.సి జాడీ సుజాత రాజేశం పది వేలు, బి.జె.పి జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు రాజారాంపల్లి ఎం.పి.టి.సి గాజుల మలేశం పది వేల రూపాయల ను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా బషీర్ మాట్లాడుతూ ఆలయ నిర్మాణం లోమా వంతు గా సహాయాన్ని అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గౌడ సంఘం సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, గౌడ సంఘం అధ్యక్షులు బర్ల జనార్దన్, సభ్యులు శేఖర్, గోపాల్, అంజయ్య, లచ్చయ్య, రాజశేఖర్, బుచ్చయ్య, బిజెపి నాయకులు మంథిని నర్సయ్య, బాల్ లింగ్, న్యాతరి మల్లేష్తదితరులు పాల్గొన్నారు.