మీర్ పేట్ కార్పొరేషన్ లో నూతన కిసాన్ మోర్చా కమిటీ ఎన్నిక

Published: Thursday August 26, 2021
బాలాపూర్: ఆగస్టు 25, ప్రజాపాలన ప్రతినిధి : మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో కిసాన్ మోర్చా కమిటీని ఎన్నిక. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనీ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెండ్యాల నరసింహ్మ ఆధ్వర్యంలో బుధవారం మీర్ పేట్ కార్పొరేషన్ బిజెపి కిసాన్ మోర్చా కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. కిసాన్మోర్చా అధ్యక్షుడిగా గోలి శ్రీనివాస్ రెడ్డి.. ప్రధాన కార్యదర్శిగా గోపిశెట్టి శ్యామ్ రాజ్. ఉపాధ్యక్షులుగా పి.వేణుగోపాల్ రెడ్డి, రఘుమ రెడ్డి, కార్యదర్శిగా ఎస్ చిన్నారెడ్డి, ఎన్నికయ్యారు. విశాల్ మోర్చా అధ్యక్షుడు మాట్లాడుతూ... మీర్ పేట్ కార్పొరేషన్లో భాజాపా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానను, నాపై నమ్మకం ఉండి నాకు ఈ పదవి బాధ్యత ఇచ్చినందుకు కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షునికి స్థానిక కార్పొరేటర్లకు నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కోడూరు సోమేశ్వర్ కార్పొరేటర్లు, హరినాథ్ రెడ్డి, పసునూరి బిక్షపతి చారి. మమత ప్రవీణ్, సీనియర్ నాయకులు నాగరాజు, శ్యామ్ సుందర్. కశిరం యాదవ్. నవీన్ కుమార్. నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.