కులసంఘ భవన నిర్మాణానికి నిధుల మంజూరు చెక్కు అందచేత

Published: Friday March 11, 2022

కోరుట్ల, మార్చ్ 10 (ప్రజాపాలన ప్రతినిధి): కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో కుల సంఘం యొక్క భవన నిర్మాణానికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే నిధుల నుండి 1,64,036/- మంజూరు చేశారు. గురువారం రోజున గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య ,ఉప సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి చేతుల మీదుగా కుల సంఘ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బద్దం రాజేశం, టీఆర్ఎస్ నాయకులు ముత్యపు శేఖర్, మురళీధర్ రెడ్డి, సంఘ సభ్యులు, భూమి అజయ్, గరిగే రాజేశం, సైదూ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.