బిజెపి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక శంకరపట్నం జనవరి 20 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Saturday January 21, 2023
శంకరపట్నం మండలం భారతీయ జనతా పార్టీ మండల శాఖ నూతన కార్యవర్గాన్ని మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ శుక్రవారం ప్రకటించారు. బిజెపి మండల ఉపాధ్యక్షుడుగా జానపట్ల రాజిరెడ్డి, సుధాగోని శ్రీనివాస్, కాంతాల రాజిరెడ్డి, పెసరి వీరార్జున్ రాజాపూర, సంపత్ రెడ్డి కన్నాపూర్ ,ప్రధాన కార్యదర్శులుగా ఎలకపల్లి సంపత్, దాసరపు నరేందర్, కార్యదర్శులుగా మీస బీరయ్య, గుంటుక సదానందం,అంతం లతా రాజిరెడ్డి, దాసరి సంపత్, దేవునురీ కుమారస్వామి, వడ్లకొండ రాజేందర్, కోశాధికారిగా చింతి రెడ్డి మల్లారెడ్డి,వివిధ మోర్చాల అధ్యక్షులు కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు మందాటి జగ్గారెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు గౌరవేణి శ్రీనివాస్,  బీజేవైఎం మండల అధ్యక్షులు బొడిగ నరేష్, దళిత మోర్చా మండల అధ్యక్షులుగా కనకం సాగర్, ఎస్ టి మోర్చా మండల అధ్యక్షులుగా బిజిలి సారయ్య, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలిగా వడాల వెంకటలక్ష్మి, మైనార్టీ మోచ మండల అధ్యక్షులుగా ఎండి అజీమ్, సోషల్ మీడియా మండల కన్వీనర్ గా చుక్కల శ్రీకాంత్, ని నియమించినట్టుగా మండల శాఖ అధ్యక్షులు ఏనుగుల అనిల్ ప్రకటించారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన మండల కార్యవర్గానికి ఈ సందర్భంగా అనిల్ సూచించారు.