ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి చేతుల మీదుగా టీఎస్ యుటిఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

Published: Tuesday February 01, 2022
ఇబ్రహీంపట్నం జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని నియమించిన సందర్భంగా టీఎస్ యుటిఎఫ్ రంగారెడ్డి జిల్లా నాయకులు కలిసి శాలువా పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీఎస్ యు టి ఎఫ్ క్యాలెండర్ ను ఎమ్మెల్యే గారిచే ఆవిష్కరింప చేశారు. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మీరంతా విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని సూచన చేశారు. నియోజవర్గంలో పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు, అదేవిధంగా స్థానిక ఉపాధ్యాయులకు న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్తు వెంకట్రాంరెడ్డి గారు టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఈ.గాలయ్య, జిల్లా అధ్యక్షులు బి.రాములయ్య, జిల్లా నాయకులు, కె.అర్జున్ రెడ్డి, జగన్నాథశర్మ, ఇబ్రహీంపట్నం నాయకులు శ్రీనివాస్, యన్.ఆనంద్ కుమార్. కె.రవి యాచారం మండల నాయకులు ఎస్ నరసింహ కే శ్రీనివాస్ మొదలగు వారు పాల్గొన్నారు.