సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి

Published: Saturday May 08, 2021
మేడిపల్లి, మే7 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 5వ డివిజన్లోని భీమ్ రెడ్డి నగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మ రెడ్డి మాట్లాడుతూ డివిజన్లో మంచినీళ్లు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ సతీష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, రాజు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.