నూతన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా వెంకట్ రెడ్డి

Published: Tuesday September 21, 2021
వలిగొండ, సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిది : వలిగొండ పట్టణంలోని దేవి శ్రీ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్ రెడ్డి మండల టిఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని సోమవారం ప్రకటించారు. వలిగొండ మండల అధ్యక్షులుగా తుమ్మల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిలుగా మామిళ్ల రత్నయ్య, అయిటిపాముల రవీంద్రలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించినందుకు భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోవు రోజుల్లో పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు డేగల పాండు యాదవ్, మాజీ జెడ్పిటిసి మొగుళ్ళ శ్రీనివాస్, మండల రైతు కోఆర్డినేటర్ పడమటి మమత నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొనపురి కవిత రాములు, పిఎసిఎస్ చైర్మన్ సురకంటి వెంకట్ రెడ్డి, ఎంపీటీసీలు పలుసం రమేష్, నోముల మల్లేష్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎలిమినేటి సత్యనారాయణ, నాయకులు ఎడ్ల నిరంజన్ రెడ్డి, మర్రి గోపాల్, నరసింహ, మచ్చ గిరి, మల్లేష్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎమ్మె లింగస్వామి, ఆయా గ్రామాలసర్పంచులు, ఎంపిటిసిలు, యూత్ కమిటీ సభ్యులు పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు