బడి బాట కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: సర్పంచ్ మర్రి తిరుపతిరావు
బోనకల్, జూన్ 7 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం జయప్రదం చేయాలని సర్పంచ్ మర్రి తిరుపతిరావు మాట్లాడుతు ప్రభుత్వం పాఠాశాలలో చదువు తున్న విద్యార్థులకు అడ్మిషన్ ప్రారంభం అవుతున్నాయని, 11 నుండి 14 వరకు జరిగె బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వం పాఠశాలలో పిల్లలను చదివించాలని మంచి మేరుగైన విద్య కోసం ఉన్నతమైన ఉపాధ్యాయులు తో కూడీన విద్యకోసం పిల్లల భవిష్యత్తు కోసం ఉన్నతవిద్యను ఆబ్యాసించాలని బడీబాట కార్యక్రమం ద్వారా ఒక అడుగు ముందుకు వేసి తమ పిల్లలను చేర్చాలని కోరారు. 6వతరగతి నుంచి 10తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అడ్మిషన్ ప్రారంభం అవుతున్నాయని , ప్రతి తల్లి తండ్రులు తమ పిల్లలను చేర్చాలని కోరారు. అనంతరం కలేక్టరు ఆదేశాల మేరకు క్రిడ మైదానం కోరకు పాఠశాల ఆవరణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, ఉపాధ్యాయులు రమేష్, పీఈటి మాధవరావు, పంచాయతీ కార్యదర్శి పరశురామ్ వి జి ఎస్ టి ఏ ప్రశన్న లు విద్యార్థులు పాల్గొన్నారు.
Share this on your social network: