వంద పడకల నిర్మాణ స్థలం ఆసుపత్రి పరిశీలించిన కలెక్టర్

Published: Friday August 13, 2021

మధిర, ఆగస్టు 12, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ మధిర నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ పి వి గౌతమ్ గురువారం పర్యటించారు. దీనిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి మధిరకు మంజూరు చేయబడిన వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి కావలసిన స్థలాన్ని స్థానిక డిగ్రీ కాలేజ్ ఆవరణలో పరిశీలించారు. ఈ సందర్భంలో స్థలానికి సంబంధించిన వివరాలను తాసిల్దార్ సైదులు నుండి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వైద్య శాఖ నుండి అనుమతులు తీసుకోవాల్సిందిగా జిల్లా వైద్య అధికారిని మాలతికి సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న మినీ స్టేడియం పనులను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో మధిర మున్సిపల్ చైర్ పర్సన్ లత, కమిషనర్ రమాదేవి, ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, ఈ ఆర్డివో ఓ రాజారావు, ప్రభుత్వ వైద్యాధికారులు, సంబంధిత శాఖల అధికారులు, రెవిన్యూ సిబ్బంది ఉన్నారు.