లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
Published: Wednesday June 15, 2022
బోనకల్, జూన్ 14 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ,బాలసాని లక్ష్మీనారాయణ సిఫార్సు తో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో మంజూరైన 1,71,500 రూపాయల విలువ గల ఆరు చెక్కులను మంగళవారం ఖమ్మం పట్టణం లోని జిల్లా పరిషత్ చైర్మన్ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేయడం జరిగినది. ఈ సందర్భంగా బాలసాని లక్ష్మీనారాయణ, కమల రాజు మాట్లాడుతూ వివిధ రకాల అనారోగ్య సమస్యలతో వైద్యం నిమిత్తం ఖర్చు చేసి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి సీఎం సహాయనిధి ద్వారా సహాయం అందించే సీఎం కేసీఆర్ మనమందరం రుణపడి ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండలానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.
Share this on your social network: