భారీవర్షాలకు ఇల్లు కూలిన నిరుపేదలకు సహాయం అందించిన - లయన్స్ క్లబ్
రాయికల్, జూలై 17 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిరంతరయంగా కురుస్తున్న వర్షాల వలన ఇండ్లు కూలి నిరాశ్రయులు అయినా నిరుపేదలకు లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ ఆధ్వర్యంలో బియ్యం మరియు నిత్యావసర సరుకులు 15 కుటుంబాలకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎద్దండి దివాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొత్తపెల్లి రంజీత్,కోశాధికారి కడకుంట్ల నరేష్,ఉపాధ్యక్షులు మచ్చశేఖర్,2వ విపి కనపర్తి శ్రీనివాస్,ఎల్ సిఐఎఫ్ దాసరి గంగాధర్,మాజీ జోన్ చైర్పర్సన్ మ్యాకల రమేష్,డిసీలు బత్తిని భూమయ్య,కాటిపెళ్లి రాంరెడ్డి,క్లబ్ సభ్యులు వాసంస్వామి,వాసం ప్రసాద్,బొమ్మకంటి నవీన్,కట్ల నర్సయ్య,ఆడెపు రామ్ ప్రసాద్,మోసరపు శ్రీకాంత్, జక్కుల చంద్రశేఖర్,కటకం కళ్యాణ్,చింతరాజు మామిడాల నాగభూషణం, సుమన్, ప్రవీణ్, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: