మైనార్టీలకు అండగా కాంగ్రెస్

Published: Wednesday April 19, 2023
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్ రావ్ థాక్రె
సంగారెడ్డి, ప్రజాపాలన ప్రతినిధి:
మైనార్టీలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రే అన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని మిలాద్ గ్రౌండ్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లింలు ఉపవాస దీక్షను విరమించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు థాక్రె ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ  ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి లో జరుగుతున్న ఇఫ్తార్ దావత్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ నుండి ఇక్కడ ఉన్న నాయకుల వరకు అందరు మైనారిటీ లకు తోడుగా నిలిచామన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దేవుడిని నేను ఎప్పుడు ఇలాగే ఇఫ్తార్ దావత్ ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ లు నదీమ్ జావీద్, రోహిత్ చౌదరి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, విహెచ్, ప్రచార కమిటి చైర్మన్     మధుయాష్కిగౌడ్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్, మాజీ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ , సంజీవరెడ్డి, గాలి అనిల్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఫిషరీ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్, జనరల్ సెక్రటరీ జగదీష్, పున్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.