మున్సిపల్ అధికారులకు ఘన సన్మానం

Published: Thursday July 08, 2021
మెట్ పల్లి, జూలై 07 (ప్రజాపాలన ప్రతినిధి): మున్సిపల్ అధికారులను బుధవారం పట్టణంలోని నాలుగో వార్డు కౌన్సిలర్ అంగడి పురుషోత్తం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డులో పరిశుభ్రంగా ఉంచడానికి నిరంతరం కృషి చేస్తున్న సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏఈ అరుణ్ కుమార్, మున్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ దుస్స నరేశ్, సానిటేషన్ ఇన్స్పెక్టర్ అక్షయ్, జవాన్లు ముజీబ్, ధర్మేంధర్, ఆర్పీలు జ్యోతి, లహరి, సుజాత, సిబ్బంది కనకయ్యలను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రణవేని సుజాత సత్యనారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు బంగారు కాళ్ళ కిశోర్, కోఆప్షన్ సభ్యులు పన్నాల మాధవరెడ్డి, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.