విఘ్నాల అధిపతికి ప్రత్యేక పూజలు : రాష్ట్ర యువమోర్చ కోశాధికారి రఘునాథ్ యాదవ్

Published: Friday September 02, 2022

శేరిలింగంపల్లి -ప్రజా పాలన /సెప్టెంబర్ 1 :బాత్రపద శుద్ధ చవితి సందర్బంగా కొండాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్ కొండాపూర్ డివిజన్ లో వివిధ వినాయక మండపాలను గురువారం సందర్శించి విఘ్నాలకు అధిపతి అయిన ఆ గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సకల శుభాలకు ప్రతీక గణనాథుడని, ఆయన చల్లని ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కొండాపూర్ డివిజన్ కన్వినర్ రక్తపు సందీప్ గౌడ్, లడ్డు యాదవ్, వినోద్ యాదవ్, కరణ్, లోకేష్, అక్షయ్, సిద్దు, అరుణ్, మదన్, ప్రసాద్, గోపి తదితరులు పాల్గొన్నారు.