విఘ్నాల అధిపతికి ప్రత్యేక పూజలు : రాష్ట్ర యువమోర్చ కోశాధికారి రఘునాథ్ యాదవ్
Published: Friday September 02, 2022
శేరిలింగంపల్లి -ప్రజా పాలన /సెప్టెంబర్ 1 :బాత్రపద శుద్ధ చవితి సందర్బంగా కొండాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్, బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి రఘునాథ్ యాదవ్ కొండాపూర్ డివిజన్ లో వివిధ వినాయక మండపాలను గురువారం సందర్శించి విఘ్నాలకు అధిపతి అయిన ఆ గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సకల శుభాలకు ప్రతీక గణనాథుడని, ఆయన చల్లని ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కొండాపూర్ డివిజన్ కన్వినర్ రక్తపు సందీప్ గౌడ్, లడ్డు యాదవ్, వినోద్ యాదవ్, కరణ్, లోకేష్, అక్షయ్, సిద్దు, అరుణ్, మదన్, ప్రసాద్, గోపి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: