కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించిన కౌన్సిలర్

Published: Thursday May 27, 2021

బెల్లంపల్లి, మే 26, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి నెల్లి శ్రీలత రమేష్ కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందించారు. బుధవారం నాడు కౌన్సిలర్ నెల్లి శ్రీలత రమేష్ మాట్లాడుతూ కాల్ టెక్స్ కు చెందిన దుమ్మ భాగ్యలక్ష్మి భర్త రమేష్, మరియు ముండ్రాతి ఉమామహేశ్వరి భర్త రవికుమార్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1,00,116 ఒకలక్ష నూట పదహారు రూపాయల చొప్పున మొత్తం రూ. 2,00,232 రెండు కళ్యాణలక్ష్మి చెక్కులను గౌరవ బెల్లంపల్లి ఎమ్మెల్యే శ్రీ దుర్గం చిన్నయ్య ఆదేశానుసారం బెల్లంపల్లి తహసీల్దార్ కుమారస్వామి గార్ల ఆధ్వర్యంలో అందించడం జరిగిందని ఆమె తెలిపారు, కరోన మహమ్మారి కోవిడ్-19 వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయాయని, చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని, అందరూ ఇంట్లోనే ఉండాలని, తప్పని సరి పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లకూడదని, ప్రతిఒక్కరు మాస్కులు ధరించాలని కోరారు, ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు నెల్లిరమేష్ తదితరులు పాల్గొన్నారు.